19, ఫిబ్రవరి 2019, మంగళవారం

bhagavadgita

నేను 80 వ దశకంలో పుట్టి పెరిగిన వాణ్ని గనక కాలక్షేపానికి పుస్తకాల మీద ఎక్కువ గా ఆధారపడే  వాణ్ని. అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి మాసపత్రికల తో పాటు  చాలా చిన్న చిన్న ఫాంటసీ, సాహస నవలలు కూడా తెలుగు లో ప్రచురించేవారు. మధుబాబు నవలలు అన్నీ అప్పట్లో అలాగే వచ్చేవి.
      ఇక సెలవుల్లో ఎప్పుడైనా ఆడు కోవడానికి మిత్రులు అందుబాటులో లేనప్పుడో లేదా  చదవడానికి కొత్త పుస్తకాలు లేనప్పుడో మా ఇంట్లో ఉన్న తి తి దే వారి చిన్న భగవద్గీత పుస్తకాన్ని చదివే వాడిని . 12-13 ఏళ్ల వయసులో అందులోని చాలా విషయాలను అర్థం చేసుకోలేక పోయినా ఆ పుస్తకాన్ని చదివిన అనుభూతి మాత్రం బాగుండేది. అందులో అర్థం చేసుకొన్న చాలా విషయాలు చాలా ఏళ్ల  వరకు గుర్తున్నాయి. భగవద్గీ త అనగానే చాలా మంది అదేదో వృద్ధాప్యంలో చదవ వలసిన ఆధ్యాతిక గ్రంథం గా భావిస్తుంటారు. కానీ చిన్న వయసు నుండి భగవద్గీత ను చదివి అందులో మనకు స్ప్హూర్తి నిచ్చే విషయాలను మననం చేసుకోవడం, ఆచరణలో పెట్టడం  వలన దైనందిన జీవితంలో ఎదురయ్యే అతి సాధారణ సవాళ్ళనుంచి  అప్పుడప్పుడు మన మనసును అతలాకుతలం చేసే బాధాకరమైన  ఆలోచనలు దాకా అన్ని మానసిక సమస్యలకు ఉపశమనం లభిస్తుందనేది నా ప్రగాఢ నమ్మకం.
  ఈ మధ్యకాలం లో ఎందుకో దేవదత్ పట్టనాయక్ రాసిన మై గీత అనే పుస్తకం చదివాలనిపించి చదివాను. ఆ తరువాత ఎప్పుడో తెచ్చుకుని చదవకుండా పక్కన పెట్టిన రెండు తెలుగు భగవ్ద్గీతలు కూడా చదివాను. అంతే కాకుండా కిండిల్ అన్ లిమిటెడ్ ప్లాన్ లో  ఉచితం గా చదువు కొనే సదుపాయం గల కొన్ని భగవద్గీత  ఈ బుక్స్  డౌన్లోడ్ చేసుకుని చదవడం ప్రారంభించాను. ఈ మొత్తం ప్రక్రియ లో  నేను పై న చెప్పిన నా నమ్మకం నాలో మరింత దృఢమైంది.
ఈ పోస్ట్ రాయడం వెనుక అసలు కారణం ఏమిటంటే పాఠకుల లో పుస్తక పఠనాభిలాష కలిగిన వారు భగవద్గీత ను మిగతా వ్యక్తిత్వ వికాస పుస్తకాల లాగే చదివి అందులో ని శ్లోకార్థాలను మన దైనందిన జీవితాల్లో మార్గదర్శకాలు గా వాడుకోవడం వలన ఒక రకమైన మానసిక సమతూకంతో జీవించడం అనేది అలవడుతుంది అని చెప్పడమే.

భగవద్గీత చదివి స్ఫూర్తి  పొందిన వారిలో లోకమాన్య బాల గంగాధర తిలక్, జాతి పిత మహాత్మ గాంధీయే కాకుండా అమెరికన్ కవి వాల్ట్ విట్ మన్, భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హెయిమేర్  లాంటి వారు కూడా ఉన్నారు. 

18, సెప్టెంబర్ 2014, గురువారం

హ్యాండ్ సానిటై జర్

ఫిబ్రవరి నుంచి మాన్యత  టెక్ పార్క్ లోని ఒక స్టాఫింగ్  సంస్థ లో కన్సల్టెంట్ విషయ పరిజ్ఞాన నిపుణుడిగా  సేవలు అన్దిస్తున్నాను. సోమవారం నుంచి నేను పని చేస్తున్న టీం మేనేజర్ ఒక రెండు వారాల పాటు ఈ ఆఫీసు లో పని చేయడానికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్హారు. ఈ కార్యాలయం అమెరికా షిఫ్ట్ లో పనిచేస్తున్నందువలన ప్రతి సాయంత్రం 6. 30 నుంచి మరుసటి రోజు ఉదయం 3. 30 దాకా పనిచేయడం జరుగుతుo ది .
     ఈ రోజు  ఒంటి గంట ప్రాంతం లో టీం లీడర్ సాగర్  ఫొన్  లో మాట్లాడడానికి బయటికి వెళ్ళాల్సి వచ్చి oది . తను తిరిగి వచ్చిన తరువాత మేనేజర్ గారితో మాట్లాడవలసి రాగా ఆవిడ సాగర్ ను ఏమిటి  సాగర్ ? మీరు మద్యం గానీ పుచ్చుకున్నారా? అని వ్యంగ్యంగా అడి గారు.  దానికతడు నేను నా భార్య ఊరిలో ఉండగా మద్యం ముట్టుకోను అని బదులిచ్చాడు . దానికి ఆవిడ అందుకనే ఆఫీసులో పుచ్చుకున్తున్నావా? అని అడి గారు.
   అక్కడే ఉన్న నేను మొత్తం వ్యవహారం గమనించడం జరిగినది. నా తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న గా నవ్వడం ప్రారo భిo చాo . అంతలో నాకు ఘాటు గా ఆల్కహాల్ వాసన తగలగా నేను కూడా ఎం జరిగిందో తెలియకుండా ఆలోచించ సాగాను. ఇంతలో పక్కన బే లో ఉన్న కుర్రాళ్ళు ఇప్పుడే రాహుల్ హ్యాండ్ సానిటై జర్ వాడాడు అని చెప్పడం తో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాం .

తరువాత నేను ఆ రాహుల్ గాడి దగ్గరకు వెళ్లి సానిటై జర్ పరిశీలించగా సీసా పై  ముద్రించిన వివరాల ప్రకారం అoదులో 99 శాతం ఆల్కాహాల్ ను వాడినట్టు తెలిసింది . మిగతా దేశం  మొత్తం గాఢ నిద్రలో మునిగిన సమయంలో   ఇక్కడ పనిచేయడం ఇటువంటి సంఘటనలు జరగక పోతే చాలా బోరింగ్ గా ఉoటుoది. అన్నట్టు ఈ చిన్న కథలో మన కథానాయకుడు సాగర్ కూడా తెలుగు వారే కావడంతో వారి అనుమతి తో ఈ టపా రాయడం జరూగుతో oది. 

25, ఆగస్టు 2013, ఆదివారం

స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్

కొద్ది సేపటి క్రితం యాహూ మెయిల్ చెక్ చేద్దామని యాహూ వెబ్ సైట్ ని సందర్శించినప్పుడు ఒక వీడియో నన్ను ఆకర్షించింది. ఇటీవలి కాలంలో సమాచార మాధ్యమాలలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ఘటన గురించి వివరించే వీడియో అది.స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ఘటన తమిళ నాడు రాష్ట్రం లో ని విల్లుపురం ప్రాంతం లో జరిగింది. స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ అంటె మానవ శరీరం తనంతట అదే దహించుకు పోవడం అన్న మాట. నేచర్ వరల్డ్ న్యూస్  అంతర్జాల ప్రచురణ  రాహుల్ అనే విల్లుపురం ప్రాంతానికి చెందిన మూణ్నేల్ల పసివాడు ఈ విధంగా స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ద్వారా తీవ్ర గాయాల పాలైనట్లు కథనం ప్రచురించింది.పలు జాతీయ అంతర్జాతీయ వార్తా పత్రికలలో కూడా ఈ ఘటన ప్రస్తావిన్చాయి.
     కాలిన్ విల్సన్ వ్రాసిన అక్కల్ట్  అనే పుస్తకంలో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. ప్రస్తుత టపా మొదటి పేరా లో ప్రస్తావించిన వీడియో ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు రెండు వందల సంఘటనలు జరిగినట్టుగా చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ను ఆంగ్ల భాషలో ఎస్.హెచ్.సి అని కురుచగా పిలుస్తున్నారు.
       విజ్ఞాన శాస్త్ర ప్రస్తుత పరిజ్ఞానం తో ఎస్.హెచ్.సి గురించి పూర్తిగా హేతుబద్ధ మైన వివరణ ఇవ్వడానికి సరిపడే పరిశోధనలు జరగలేదు. కానీ జో నికెల్ అనే వైజ్ఞానికుడు మరియు జాన్ ఎఫ్ ఫిషేర్ అనే ఫోరెన్సిక్ నిపుణుడు 1984 లో ఈ విషయం పై రెండేళ్ళ పాటు విస్తృత పరిశోధనలు చేసి తమ పరిశోధనలో తేలిన విషయాలను అక్షరబద్ధం చేసినట్టు వికి పెడియా వ్యాసం ద్వారా తెలుస్తోంది.
    ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే చదువరులు హౌ స్టఫ్ వర్క్స్ వెబ్ సైట్ లో టేల్స్ అఫ్  స్పాన్టేనియస్   కంబషన్  అనే వ్యాసం చదవగలరు. అంతే కాకుండా , ది శాడో ల్యాండ్ అనే వెబ్సైటు లో ఎస్.హెచ్.సి చాయా చిత్రాలు కూడా చూడవచ్చు. ఈ ఎస్.హెచ్.సి ఘటనల పై విజ్ఞాన శాస్త్రం భవిష్యత్తు లో ఎలాంటి స్పష్టత ఇస్తుందో భవిష్యత్తులో తెలుసుకుందాం.

20, మార్చి 2013, బుధవారం

యాంటి బయాటిక్ రెసిస్టన్స్-వైద్య శాస్త్రానికి పెను సవాల్?

అంటు వ్యాధులు , సూక్ష్మ జీవుల వలన కలిగే పుండ్లు,గొంతు నొప్పి,దంత సమస్యలు,విరోచనాలు వంటి ఆరోగ్య సమస్యలను నయం చెయ్యడానికి యాంటిబయాటిక్స్ ని వాడమని వైద్యులు సలహా ఇవ్వడం ఈ రోజుల్లో సర్వ సాధారణం.వైద్యుల సలహా లేకుండా కొందరు ఓవర్ ది కౌంటర్ (over the counter) యాంటిబయాటిక్స్ ని తరచు గా వాడుతుంటారు.కొన్నేళ్ళ క్రిందటి వరకు నాకు కూడా ఇలా అవసరమైనప్పుడు యాంటిబయాటిక్స్ తో సొంత వైద్యం చేసుకోవడం అలవాటుగా ఉండేది. అమోక్సీసిల్లిన్, ఎరిత్రోమైసిన్,సిప్రొఫ్లొక్షసిన్  లాంటి యాంటి బయాటిక్స్ ను అవసరానికి మించి , వైద్యుల సలహా లేకుండా వాడడం వలన జరిగే హాని గురించి వైద్య శాస్త్రజ్ఞులకు ఒక అవగాహన ఉంది.
 యాంటి బయాటిక్స్  శరీరం లో ని రోగ కారక క్రిములపై విష ప్రభావం చూపి వాటిని మనశారీరం లో నుంచి పూర్తిగా నిర్మూలించి మనకు మేలు చేస్తాయి.కానీ వైద్యులు సూచించిన మోతాదులో , వారు నిర్దేశించిన కాలం పాటు యాంటి బయాటిక్స్ వాడకం జరగక పోతే రోగ కారక సూక్ష్మ జీవులు (ఉదాహరణకు బాక్టీరియా) ఆయా యాంటి బయాటిక్స్ ను నిర్వీర్యం చేసే జన్యువులు, ఎంజైముల వ్యవస్థను పెంపొందింప చేసుకునే ప్రమాదం ఉంది. దీనినే యాంటి బయాటిక్ రెసిస్టన్స్ గా పేర్కొంటారు.ఇలా అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులను కలిగిన సూక్ష్మ జీవుల పై సాధారణం గా వైద్యులు సూచించే యాంటి బయాటిక్స్ ఏ విధమైన ప్రభావం చూప లేవు.ఇటువంటి  యాంటి బయాటిక్ రేసిస్టంట్ రోగకారక క్రిముల నిర్మూలనానికి మరింత శక్తివంతమైన విషతుల్యమైన యాంటి బయాటిక్స్ ని మన శరీరం లో కి పంపించ వలసి ఉంటుంది. దీని వలన రోగి శరీరం లో ఇతర దుష్పరిమాణాలు కలిగే ప్రమాదం ఉంది.ఒక రకమైన యాంటి బయాటిక్స్  పై నిరోధక శక్తి ని సూక్ష్మజీవులపై మొదటి  యాంటి బయాటిక్స్కంటే ఎక్కువ ప్రభావ వంతమైన ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ ని వాడ వలసి ఉంటుంది.ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ అంటే ఆ మందుల ను  ఆఖరి  ఆయుధం గా వాడుతున్నాం అన్న మాట.వాటి తరువాత రోగ చికిత్సకు ఉన్న మార్గాలన్నీ మూసుకు పోతాయి.తరువాత ఫార్మా రంగం లో మరింత ప్రభావవంతమైన శక్తివంతమైన మందుల పై పరిశోధనలు జరిగి కొత్త యాన్తిబయాతిక్స్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం కలుగుతుంది.
గత వారం ఈనాడు పేపర్లో మరియు ఇండియా టుడే వార పత్రిక లో యాంటి బయాటిక్ రెసిస్టన్స్ పై సమగ్రమైన వ్యాసాలు ప్రచురించారు.యాంటి బయాటిక్స్ వాడకం మొదలైన తరువాత  వీటి వాడకం ద్వారా చాలా వరకు  అంటువ్యాధులను నిర్మూలించడం జరిగింది.రెండవ ప్రపంచ యుద్ధ కాలం వరకు శాస్త్ర చికిత్సల తరువాత వచ్చే ఇన్ఫెక్షన్స్(పోస్ట్ సర్జికల్ ఇఫెక్షన్స్) వలన , ప్రసవం తరువాత (పోస్ట్ పార్తం) ఇన్ఫెక్షన్స్ వలన చాలా మంది చని పోతుండే వారు.యుద్ధంలో గాయ పడిన సైనికులకు చికిత్స చేసే సమయం లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం గా శస్త్రచికిత్స ద్వారా అవయవాలను తొలగించి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు శరీరం మొత్తం వ్యాపించ కుండా ప్రాణ హాని ని తగ్గించే వారు.కానీ అప్పట్లో సూక్ష్మ జీవులతో పోరాడటానికి సరైన మందులు వైద్య శాస్త్రానికి అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు విజయవంతమైనప్పటికీ సూక్ష్మజీవుల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకం గా పరిణమించేవి.

౧౯౨౯ లో అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ అనే ఆంగ్ల శాస్త్ర వేత్త అనుకోకుండా పెనిసిల్లియం అనే ఒక రకమైన శిలీన్ద్రం స్తఫిలోకోకస్ అనే బాక్టీరియా పెరుగుదలను అడుపుచేయగల పెనిసిలిన్ అనే ఔషధాన్ని ఉత్పత్తి చేయడం గమనించాడు.ఈ ఔషధాన్ని శుద్ధి చేసి చికిత్స కోసం తయారు చెయ్యడానికి హోవార్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చైన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు దశాబ్దం పైగా సమయం పట్టింది.౧౯౪౨ లో మొట్టమొదటి సారిగా వీరు ఇరువురూ తయారు చేసిన పెనిసిల్లిన్ యాంటి బయాటిక్ ని ఒక గాయ పడిన వ్యక్తి కి అందించి బాక్తీరియల్ ఇన్ఫెక్షన్ ను అదుపు చేయ గలిగారు.కానీ సరైన మోతాదు లో శుద్ధి చేయబడిన పెనిసిల్లిన్ లభ్యం కాలేక పోవడం తో ఆ రోగి మృతి చెందాడు.ఆ తరువాత పెనిసిల్లిన్ విరివిగా వాడుక లో కి వచ్చింది.పలు రకాల ఇతర యాన్తిబయాతిక్స్ ను కూడా శాస్త్రజ్ఞులు త్వరిత గతిన కనుగొని మరిన్ని వ్యాధులను అంతం చేసే మార్గం సుగమం చేశారు.అలేక్జాన్దర్ ఫ్లెమింగ్,ఫ్లోరీ,చైన్ లు నోబెల్ ప్రైజు కూడా గెలుచుకున్నారు.తన నోబెల్ ప్రైజు స్వీకార ప్రసంగంలో నే అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ యాంటి బయాటిక్ రేసిస్తంట్ క్రిముల పరిణామ ప్రక్రియ గురించి హెచ్చరించడం విశేషం.
    మితి మీరిన యాంటి బయాటిక్ ల వాడకం వలన భారత దేశంలో చాలా రకాల సాధారణ యాన్తిబయాతిక్స్ కు లొంగని క్రిములు ప్రబలి ప్రపంచ వ్యాప్తం గా వ్యాపిస్తున్నట్లు ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో మూడేళ్ళ క్రితం ప్రచురింప బడిన ఒక పరిశోధనాత్మక వ్యాసం పేర్కొంది.మన దేశం లో " న్యూ ఢిల్లీ మేటల్లో బీటా లాక్టమేజ్" అనే ఎంజైమ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా యాన్తిబయాతటిక్ లను నిర్వీర్యం చేసే బాక్టీరియాలు, సంబంధిత జన్యువులు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఇటువంటి వార్త ల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మితి మీరిన యాన్తిబయాతిక్ ల వినియోగానికి అడ్డుకట్ట వెయ్యక పోతే చాలా మంది ప్రజలు యాంటి బయాటిక్ రెసిస్టన్స్  జన్యువులు కలిగిన క్రిముల ద్వారా వ్యాపించే  ఆరోగ్య సమస్యల కు ప్రాణాలు బలిచేయాల్సి వస్తుంది.అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలాలో యాంటి బయాటిక్స్ వాడకాన్ని ప్రభుత్వం అతి సమర్థ వంతం గా నియంత్రించి దేశ ఆరోగ్య భద్రతను కాపాడుతున్నట్లు ఇండియా టుడే పత్రిక తన మర్చి ౮ కథనం లో పేర్కొంది.

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

బెంగళూరు సంప్రదాయక హోటళ్ళు #2 బ్రాహ్మణుల కాఫీ బార్, శంకర పురం, బసవన గుడి



బెంగళూరు సంప్రదాయక హోటళ్ళ పై రాస్తున్న రెండవ టపా ఇది.ఇప్పటికే ఈ హోటళ్ల గురించి బెంగళూరు వాసులైన చాలా మంది తెలుగు బ్లాగర్స్ కి తెలిసి ఉండవచ్చు.మిగిలిన వారికి బెంగళూరు లో నేను ముఖ్య మైన అంశం గా భావించే చిన్న హోటల్స్ గురించి నా బ్లాగ్ ద్వారా తెలియబరచాలనే ఉద్దేశ్యంతో ఈ టపాలను ప్రచురిస్తున్నాను.

      బ్రాహ్మణుల కాఫీ బార్ గా పిలువబడే ఈ చిన్న హోటల్  దక్షిణ బెంగళూరు వాసులకు కొన్ని దశాబ్దాలు గా సుపరిచితం.ఈ హోటల్ చామరాజ్ పెట్ మరియు గాంధీ బజార్ నుంచి కూత వేటు దూరం లో శంకర పురం లో ఉంది.ఫెబ్రవరి మాసం తొలి ఆదివారం టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక లో జి ఎస్ కుమార్ ఈ కాఫీ బార్ గురించి రాసిన డిలైట్ ఫుల్ ఇడ్లి అండ్ దోస ఫేర్ ఫర్ ఎర్లీ బర్డ్స్  అనే ఆర్టికల్ చదివాను.గత ఎనిమిదేళ్ళ నుంచి సాయంకాలం పూట ఇంటికెళ్ళే ముందు అప్పుడప్పుడూ మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లడం నాకు అలవాటు. అప్పట్లో ఈ కొట్టు చాలా చిన్న గా ఉండేది గానీ ఎప్పుడూ జనసమ్మర్ధం గా ఉండేది.రెండేళ్ళ క్రితం పునర్నిర్మించారు.అయినా వారి మెనూ లో ఎటువంటి మార్పు లేదు. బ్రాహ్మణుల కాఫీ బార్ లోకాఫీ, టీలతో పాటు   ఇడ్లి,దోస,ఉద్దిన వడ మరియు ఖారా బాత్ దొరుకుతాయి.ఇన్నేళ్ళలో రుచి లో నూ నాణ్యత లో ఎలా౦టి తేడా కనిపించట్లేదు.

పై చిత్రం లో మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక బి.జే.పి అగ్ర నాయకుడు అనంత్ కుమార్ ఇక్కడ ఆహారాన్ని ఆస్వాదిస్తుండడం చూడవచ్చు.ఈయన లాగే చాలా మంది ప్రముఖులు ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటారట.

18, ఫిబ్రవరి 2013, సోమవారం

నమ్మితీరాల్సిన నిజం : మన శరీరం సూక్ష్మ జీవుల మయం.(బాక్టీరియా , వైరస్ ల మయం)

చిన్నప్పుడు స్కూల్ లో సూక్ష్మ జీవుల గురించి తెలుసుకున్నప్పటినుంచి, సూక్ష్మ జీవులన్నీ రోగాలను కలుగజేస్తాయని మనలో కొందరు అపోహ పడుతుంటారు. అసలు విషయం ఏమిటంటే, మన శరీరం మొత్తం దాదాపు 100 ట్రిలియన్ సూక్ష్మ జీవ కణాలకు నిత్య ఆవాస నిలయం. రోగ పీడుతులు కాని అత్యంత ఆరోగ్యవంతుల శరీరం లో కూడా వివిధ అవయవ వ్యవస్థలు సూక్ష్మ జీవులకు ఆవాస కేంద్రాలు గా నిలుస్తున్నాయి.మన చర్మం,కేశములు,రోమములు,రోమ రంధ్రాలు,కేశమూలాలు,ముక్కు,శ్వాశ నాళాలు,నోరు,ప్రేగులు, మర్మావయవాలు, ఇంకా ఇతర అవయవాలు కొన్ని మంచి సూక్ష్మ జీవులను కలిగి ఉండడమే కాకుండా వీటి వలన మనం లబ్ది పోదేలా చేస్తున్నాయి. మన శరీరం లో నివసిస్తున్న అన్ని సూక్ష్మ జీవులనూ కలిపి హ్యుమన్ "మైక్రో బయోం" అని పిలుస్తాం. సూక్ష్మ జీవుల వలన కలిగే అంటూ వ్యాధులను మన భూమిపై ఉన్న కేవలం అతి కొద్ది శాతం సూక్ష్మ జీవులు మాత్రమే కలుగ జేస్తాయి.ఇప్పటి వరకు భూమి మీద మనకు తెలిసిన అన్ని సూక్ష్మ జీవుల  ( అంటే- నేల, నీరు, గాలి,చెట్లు మరియు ఇతర జంతువులలో ఉన్నవి) సంఖ్యతో పోల్చితే , వ్యాధి కారక సూక్ష్మ జీవుల సంఖ్య అత్యల్పం.కానీ  మానవుని ఉనికికి ప్రమాదం కలిగించే శక్తి ప్రస్తుతం ఈ అతి స్వల్ప సంఖ్యాక వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్ర్హమే ఉంది! యుధాలు, ప్రకృతి వైపరీత్యాల తరువాత, భారీ ఏత్తున మానవ జన నష్టం కలిగించే  సామర్థ్యం కేవలం ఈ వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్రమే ఉంది.బాక్టీరియా,వైరస్ , ఫంగై (శిలీంధ్రాలు, బూజు), ఆల్గే(నాచు), ప్రోటో జోవన్లను సూక్ష్మ జీవులు అని అంటారు.వీటిని మనం కంటితో నేరు గా చూడలేం.సూక్ష్మ దర్శిని (మైక్రో స్కోప్) వినియోగించి మాత్రమే చూడగలం కాబట్టే వీటిని సూక్ష్మ జీవులు అని పిలుస్తాం.
      పై చిత్రం లో ఎడమ వైపు మన శరీర సహజ రోగ నిరోధక వ్యవస్థ లోని భాగాలు, కుడి వైపు మానవ శరీరం లో సహజం గా జీవిస్తున్న సూక్ష్మ జీవుల ను పెర్కోనడం జరిగింది. మనకు వ్యాధులు సంక్రమించకుండా ఈ మంచి బాక్టీరియా  రోగ నిరోధక వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి.
  మానవ శరీరం లోకి ఈ సూక్ష్మ జీవులు ఎలా ప్రవేశిస్తాయి? అనే సందేహం తలెత్త వచ్చు.ఇవి మన దేహంలోకి మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే సమయం నుండి జీవితాంతం శ్వాశ క్రియ,నీరు త్రాగడం,ఆహారం,కొన్ని ప్రో-బయోటిక్ ఔషధ సేవనం లాంటి వివిధ సహజ ప్రక్రియల ద్వారా మన దేహము లోనికి ప్రవేశిస్తాయి.బిడ్డ పుడుతున్న సమయంలో తల్లి జననాంగాల నుంచి అనేక రకాల బాక్టీరియాలు మన దేహం లోనికి ప్రవేశిస్తాయి.గర్భిణీ స్త్రీల జననాన్గాలపై ఉన్న సూక్ష్మ జీవులు శిశువు జీర్ణవ్యవస్థ లో ఆవాసం ఏర్పరచు కొని ( ప్రేవులలో) తల్లి పాలను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.ఈ సూక్ష్మ జీవుల సంఖ్యా ఇతర స్త్రీల కంటే గర్భిణీ స్త్రీ లలో అధికంగా ఉంటుంది. తల్లి పాలను త్రాగుతున్నంత కాలం శిశువు శరీరం కొత్త కొత్త సూక్ష్మ జీవులను తన దేహమ్లోనికి స్వీకరిస్తూనే ఉంటుంది.
  బిడ్డ పెరిగి పెద్దవాడైన తరువాత దేహం లో ని సూక్ష్మ జీవుల జనాభా లో చాలా క్లిష్ట మైన మార్పులు చేర్పులు జరుగుతాయి.అదే సమయంలో ఈ సూక్ష్మ జీవులు శరీర రోగ నిరోధక వ్యవస్థ కు రోగ కారక క్రిములను ఎదుర్కోవడానికి అవసరమయ్యే వివిధ యంత్రాంగాలను పటిష్ట పరచుకోనేలా కూడా చేస్తాయి.మనం పెరిగే వయసులో అతి త్జక్కువ క్రిములకు మాత్రమే ఎదురు పడితే అంటే, అవసరానికి మించి అతి గా శుచి శుభ్రతలకు అలవాతుపడినా, లేదా అవసరానికి మించి అంటిబయాటిక్ ఔషధాలను వాడడం అలవరచుకున్నా అల్లర్జీ లాంటి రుగ్మతల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ గా ఉంటుందని వైద్య శాస్త్ర పరిశాధనలలో తేలింది.అంటి బయాటిక్స్ ను అతి గా వినియోగించడం వలన మన శరీరం లో ని మేలు కలిగించే క్రిములను చాలా వరకు నష్ట పోతాం.అందుకనే , ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి డాక్టర్లు అంటి బయాటిక్స్ ప్రేస్క్రైబ్ చేసేటప్పుడు వాటి తో పాటు ఏదైనా ప్రో-బయోటిక్  పొడిని గానీ, మాత్రలను గానీ వాడమని చెబుతారు.మనం ఈ ప్రో బయోటిక్  మందుల కవర్ పై ముద్రించిన విషయాలను చదివితే ప్రో-బయోటిక్ ఉత్పాదనలో చాలా లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేసే బాక్టీరియా ల పేర్లు మనకు కనిపిస్తాయి. ఇవి మన పెద్ద ప్రేగును చేరి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని హాని కారక క్రిముల వలన విరోచనాలు, అతిసార వ్యాధి కలగకుండా కాపాడుతాయి.మనం యోఘుర్ట్,పెరుగు,మజ్జిగ లాంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ని మంచి సూక్ష్మ జీవుల సమతుల్యతను కాపాడుకోవచ్చు.
                 మన దేహంలో నివసించే సూక్ష్మ జీవుల వైవిధ్యాన్ని కనిపెట్టడం చాలా కష్టం. న్యూ యార్క్ టైమ్స్ దిన పత్రిక గత జూన్ ౧౮ వ తేదీ ప్రచురించిన కథనం ప్రకారం మానవుని నోటి లో 75 నుంచి  100 జాతుల (స్పీసీస్) సూక్ష్మ జీవులు ఉండవచ్చు. ఒకరి నోటి లో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు ఇంకొకరి నోటిలో ఉండక పోవచ్చు.మరొక అంచనా ప్రకారం మన నోటిలో ఉన్న సూక్ష్మ జీవుల జాతుల సంఖ్యా దాదాపు గా 5000 ఉండవచ్చు.
   మన శరీరం లో బాక్టీరియా తో పాటు వైరస్ లు కూడా ఉన్నాయి.ఈ వైరస్లలో చాలా భాగం మన శరీరం లో ని వైర ల పై పరాన్న జీవులు గా పనిచేస్తుననాయి.అంటే మన శరీరం ఒక సూక్ష్మ జీవ జాలాన్ని కలిగి ఉందన్నమాట.దీన్నే ఆంగ్లం లో ఇకో సిస్టం అంటారు. మనం మన శరీరం లో ఇలాంటి సూక్ష్మ జీవుల ఇకో సిస్టం ను కొనసాగిస్తున్నాం.
మన మైక్రో బయోం లో దాదాపు నూరు జాతుల ఫంగై కూడా ఉన్నాయట.

 అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ సంస్థ ఐదేళ్ల పాటు 80 పరిశోధక సంస్థలకు చెందిన 200 వందలమంది శాస్త్రవేత్తలతో కలిసి 250 మంది వాలంటీర్ల సహజ సూక్ష్మ జీవ జాలం పై హుమన్ మైక్రో బయోం ప్రాజెక్ట్ ను నిర్వహించింది.ఈ అధ్యయనం లో భాగం గా  250 మంది వాలంటీర్ల శరీరాల నుంచి సేకరించిన సూక్ష్మ జీవుల నమూనా ల డి.ఎన్.ఏ సీక్వెన్సింగ్ నిర్వహించారు. ఈ అధ్యయనం లో పాల్గొన్న వాలన్టీర్లు అందరూ తమకు దేహంలో ఎక్కడా ఎటువంటి సూక్ష్మ జీవ జనిత వ్యాధులు లేవని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొన్న తరువాతనే ఈ అధ్యయనం లో భాగం కావిన్చబడ్డారు.ఈ అధ్యయనం పర్యవసానం ఏమిటంటే భవిష్యత్తులో మన రోగాలకు చికిత్స చేసేముందు వైద్యులు మన శరీరం లో ని మైక్రోబయోమే ని దృష్టి లో ఉంచుకొని వైద్యం చేస్తారు.మార్కెట్ లో లభ్యమవుతున్న చాలా అన్తిబయాటిక్స్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ని నయం చేయలేక పోతున్నాయి.దీనికి కారణం రోగ కారక క్రిములు జన్యు పరం గా అంటి బయాటిక్స్ ను నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించు కోవడమే.ఈ ప్రక్రియను అంటి బయాటిక్ రెసిస్టన్స్ అని అంటాం.అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులు పర్యావరణం లో విరివి గా ఒక బాక్తెరియా నుంచి ఇంకొక బాక్టీరియా కు సంక్రమిస్తుండడం వలన విపరీతం గా అంటి బయాటిక్స్ ను తట్టుకో గలిగే రోగ కారక క్రిములు శరవేగం గా తయారై ప్రాణ సంకటం గా సంక్రమిస్తునాయి.హుమన్ మైక్రో బయోం పై శాస్త్రీయ అవగాహన కలగడం వలన అన్తిబయాతిక్స్ లేకుండా నే అంటు రోగాలకు చికిత్స చేయడం సులభ తరం కావచ్చు.

  చాలా వరకు మనం  కేవలం ఒక వ్యక్తి గా పరిగానణిమ్చబడుతుంటాం.. ఇప్పుడు మనలో కొన్ని వేల రకాల సూక్ష్మ జీవులు కూడా బ్రతుకుతున్నాయని తెలుసుకున్న తరువాత మనం ప్రకృతి లో ఒక భాగం అనుకోవాలా? లేదా మనమే ఈ సూక్ష్మ జీవులకు ఆధారభూతమైన ఒక  ప్రకృతి అనుకోవాలా? మనం మన కోసం మాత్రమే భోజనం  చేస్తున్నామా లేదా మనకు తెలియకుండా మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ మైక్రోస్కోపిక్ జీవ లోకం కోసం బ్రతుకుతున్నామా?విజ్ఞాన శాస్త్ర పురోగతి ఇలాంటి ప్రశ్నలకు మున్ముందు సహేతుకమైన సమాధానాలను అందిస్తుందని ఆశిద్దాం.ఈ టపా చదివిన తరువాత కూడా ఇంకా కొంత సమాచారం కోసం అన్వేషించదలచె వారు ఈ బ్లాగ్ పోస్ట్ ను అనుసరించగలరు.ఇందులో ఇతర ఉపయోగకర సమాచారాన్ని అందించే మరికొన్ని కథనాలకు లంకెలున్నాయి.


13, ఫిబ్రవరి 2013, బుధవారం

నానో టెక్నాలజీ -అపాయాలకు అవకాశాలు

ఒక మీటర్ లో 100,000,00,00,000 వ వంతును (ఒన్ బిల్లియంత్  అఫ్ ఏ మీటర్) ను నానో మీటర్ అని పిలుస్తాం.వికీపీడియా ప్రకారం ఒక నానో మీటర్ ఒక మీటర్ లో లక్ష కోటవ వంతుకు సమానం.అంటే ఒక మీటర్ ను లక్ష కోట్ల సమభాగాలు గా విన్హజిస్తే , ప్రతిభాగం ఒక నానో మీటర్ కొలతను కలిగి ఉంటుందన్న మాట.ఈ వికీపీడియా వ్యాసం లో  "నానో టెక్నాలజీ" ని "పరమాణు సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం" గా పేర్కొన్నారు.
                                                                               ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం లో ఉన్న పదార్థాలను నానో రేణువులు(నానో పార్టికల్స్) అని అంటారు.ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం గల పదార్థాలను ,వస్తువులను, రేణువులను, యంత్రాలను తయారు చేయడం,ఆ పరిమాణం గల వస్తువులను మార్పులకు గురి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నానో టేక్నాలజీ అని పిస్తారు.ఇటీవలి కాలం లో నానో టెక్నాలజీ రంగం  బాగా వ్యాప్తిలోకి వచ్చింది.సౌందర్య సాధనాలు,ఆహార పదార్థాలు, కంపూటర్లు,టీవీ ల లాంటి వినోద సాధనాలు,పెయింట్ , ఆహార పదార్థాల తయారీ, ఆయుధాల తయారీ, సమాచార ప్రసార వ్యవస్థ , వైద్య రంగం లో నానో టెక్నాలజీ వినియోగం వలన రానున్న రోజులలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

                                            భారత ప్రభుత్వం కూడా ఈ రంగంలో పరిశోధనలను అనేక విధాలుగా ప్రోత్సహిస్తోంది.యూరోపియన్ కమిషన్  దేశాలు,అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, చైనా, జపాన్, జర్మనీ ఇంకా ఇతర దేశాలకు చెందిన పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఈ నానోటెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త పరికరాలను తయారు చేసే పని లో నిమగ్నమై ఉన్నాయి.ఈ   నానోటేక్నాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకోగోరే వారు పైన ప్రస్తావించిన వికీపెడియా లంకె ను అనుసరించగలరు.
                                              ఇప్పటికే మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీ లాంటి కొన్ని విద్యాసంస్థలు నానో బయో టేక్నాలజీ కోర్సులను అందిస్తునాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో "కీడెంచి మేలెంచు" అనే దృక్పథం ప్రస్తుతానికి చాలా తక్కువమంది శాస్త్రవేత్తలు, వ్యాపార వేత్తలకు మాత్రమె ఉంది.కొన్ని నూతన పరికరాలను , నూతన శాస్త్ర విజ్ఞానాన్ని వాడేటప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన కలిగే స్వల్ప కాలిక దీర్ఘ కాలిక పర్యవసానాలను అంచనా వేయడం,అధ్యయనం చేసి సమగ్ర మైన వ్యక్తిగత ,సామాజిక ,పర్యావరణ  భద్రతకు సంబంధించిన అంశాలను క్రోడీకరించి జనసామాన్యానికి అందుబాటులో ఉంచడం చాలా అవసరం.

        ఏ పదార్థాన్నయినా అతి సూక్ష్మ స్థాయి లో మార్పు చేస్తున్నప్పుడు అను రేణువుల స్థాయి లో పదార్థ ప్రవర్తన,స్వభావం చాలా మార్పులను చూపిస్తుంది.పరమాణు సూక్ష్మస్థాయి రేణువుల ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండడం తో అవి భౌతిక రసాయనిక చర్యలలో అతి వేగంగా పాల్గొని ప్రాణ హాని కలిగించే విష పదార్థాలుగా పరివర్తన చెంది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగించ వచ్చు.2008 మార్చి మాసం లో సైంటిఫిక్ అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఫ్రెండ్స్ అఫ్ ఎర్త్ అనే పర్యావరణ సంస్థ దాదాపు వంద వరకూ నానో టెక్నాలజీ ఆధారిత ఆహారపదార్థాలు అమెరికన్ మార్కెట్లో వినిమయములో ఉన్నట్లు గుర్తించింది. ఈ కథనం ప్రకారం ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2005 లో జరిపిన ప్రయోగాలలో జింక్ ఆక్సైడ్ నానో రేణువులు అతి తక్కువ పరిమాణం లో కూడా మానవుని ఊపిరితిత్తుల కణాలకుసంబంధించిన  సమస్యలను కలిగిస్తాయని తేలింది.ఎలుకలపై జరిపిన మరికొన్ని ప్రయోగాలలో వెండి నానో రేణువులు కాలేయ కణాలు, మెదడు లోని కణాలను చంపివేసే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయని కనుగొన్నారట.


       గత కొద్ది కాలం గా అంతర్జాలం లో మరియు సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమౌతున్న పరిశోధనాత్మక వ్యాసాలు నానో టెక్నాలజీ లో భద్రతా పరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండబోతుందని హెచ్చరిస్తున్నాయి.నానో టెక్నాలజీ ఉత్పత్తులు వాడే వినియోగదారులు, తయారీ లో పాల్గొనే ఉద్యోగులు, నిపుణులు, నానో టెక్నాలజీ ఆధారిత వ్యర్థ పదార్థాల ప్రభావానికి లోనయ్యే వారు  ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.ఈ కొత్త సాంకేతిక శాస్త్ర  ఆధారిత ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి వదిలేముందు భద్రతా పరమైన అంశాలపై కూడా సమగ్ర పరిశోధనలు జరపాల్సిన భాద్యత ప్రభుత్వాలకు, శాస్త్ర వేత్తలకు ఉన్నది. మరిన్ని వివరాలకు  పార్టికల్ అండ్ ఫిబెర్ టాక్సికాలజీ అనే అంతర్జాల జర్నల్  2006 లో ప్రచురించిన "ది పోటేన్శిఅల్ రిస్క్స్ అఫ్ నానో మటీరియల్స్: ఏ రివ్యూ కారీడ్ అవుట్ ఫర్ ఈసిఈటిఈసి" అనే పేరుతో ప్రచురించిన వ్యాసాన్నిచదవగలరు.